విభజన కష్టాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాం: మంత్రి యనమల

  • సమర్థ నాయకత్వంలో సక్రమమైన ఫలాలు అందుకుంటున్నాం
  • చంద్రబాబు నేతృత్వంలో పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది
  • ఈ ఏడాది కూడా కష్టపడి పని చేస్తే మరింత వృద్ధి సాధిస్తాం
విభజన కష్టాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తూ బయటకు వస్తున్నామని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న కలెక్టర్ల సమావేశం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ప్రజాదర్బార్ హాలులో ఈరోజు ప్రారంభమైంది.

ఈ సమావేశంలో పాల్గొన్న యనమల మాట్లాడుతూ, సమర్థ నాయకత్వం, దిశానిర్దేశంతో సక్రమమైన ఫలాలు అందుకుంటున్నామని, సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనిచేయడంతో అనుకున్నట్టుగా ఫలితాలు సాధించామని చెప్పారు. ఈ ఏడాది కూడా కష్టపడి పని చేస్తే మరింత వృద్ధి సాధిస్తామని, నిధుల విడుదలలో ఎక్కడా జాప్యం లేకుండా చూస్తున్నామని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Yanamala

More Telugu News